Loading...

17, ఏప్రిల్ 2018, మంగళవారం

మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవిఎమ్ ల పరిశీలన

- ఆర్.డి.వో ఎల్.రఘుబాబు వెల్లడి
కాకినాడ, ఎప్రిల్ 17(చైతన్యవారధి):
రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఉత్తర్వులు ప్రకారముప్రకారము తూర్పుగోదావరి జిల్లా కలక్టరు వారి కార్యాలయము ప్రక్కన గల ఎన్నికల గోదామునందు భద్రపరచిన ఇవిఎమ్ లను నూరు శాతము  మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయుటకు ఈ  రోజు ఉదయము కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు అద్వర్యములో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షములో ఎన్నికల గోదామును తెరిచి ఇవిఎమ్ లను నూరు శాతము  మొబైల్ అప్లికేషన్ ద్వారా పరిశీలన చేయు కార్యక్రమము ప్రారంభించడమైనది. ఈ యొక్క పరిశీలన కార్యక్రమము ఈ రోజు నుండి ఈ నెల 25 వ తేదీ వరకు జరుగు ఇవిఎమ్ లు పరిశీలన జరుగునని ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తెలిపియున్నారు. అదే విధముగా ప్రస్తుత ఎన్నికల గోదామునందు మొదటి అంతస్తు  నిర్మాణములో ఉన్న అదనపు గోదాము నిర్మాణము పనులు పరిశీలించి గోదాము నిర్మాణ పనులు వేగవంతము చేయాలని సదరు గోదాము నిర్మాణ గుత్తేదారును ఆదేశించియున్నారు. ఈ యొక్క పరిశీలన కార్యక్రమములో కాకినాడ ఆర్.డి.వో ఎల్.రఘుబాబు తో పాటు భారత జనతా పార్టీ జిల్లా పార్టీ అద్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సి.పి.ఐ. పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్.కిషోర్,  కాకినాడ అర్బన్ తహశీల్దార్ జి.బాలసుబ్రహ్మణ్యం, తహశీల్దార్ కె.ఆర్.సి ఎం.విద్యాసాగర్, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్ జె.వి.ఆర్.రమేష్, కె.యస్.వి.సుబ్బారావు, సాంఘిక సంక్షేమ శాఖ సహయ ఇంజీనీరు సుబ్బరాజు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి