గాజువాక, ఏప్రిల్, 17(చైతన్యవారధి): జీవీఎంసీ ౫౦వ వార్డు పరిధిలో గల సంజీవిగిరి కాలనీలో గల విజ్ణాన్ స్కూల్ లో ఎమ్ సెట్, పాలిటెక్నిక్ విద్యార్దులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు. జాన్సీ ఎడ్యుకేషనల్ సోసైటీ సహకారంతో ఈ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రధర్ రావు, తెదేపా విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ ముఖ్య అథితులుగా పాల్గొని విద్యార్ధులకు అందజేశారు. సుమారు 2౦౦ మంది విద్యార్ధులకు ఈ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజ్ణాన్ స్కూల్ డైరెక్టర్ డి.వి.రమణీ, జాన్సీ ఎడ్యుకేషనల్ ట్రస్టు వ్యవస్ధాపకులు వానపల్లి శ్రీనివాసరావు, ఎం.ఎస్.కుమార్, సి.హెచ్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి