ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కౌమార దశ బాల బాలికల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టండి

విశాఖపట్నం, చైతన్యవారధి:
పాఠశాలలలో బాలబాలికల  కౌమార దశల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిందిగా  జిల్లా కలెక్టర్‌  ప్రవీణ్‌ కుమార్‌ సంబందిత అధికారులను  ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో రాష్ట్రీయ కిశోర్‌ స్వాస్త్య కార్యక్రమం  లో భాగంగా  యునిసెఫ్‌ సహకారంతో యూత్‌ ఫర్‌ సేవ సంస్థ   ఏర్పాటు  చేసిన  కార్యక్రమంలో  కలెక్టర్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ప్రభుత్వ ,సంక్షేమ  పాఠశాలలలో మరుగుదొడ్లు, నిరంతర నీటి సదుపాయం, ప్రహరీ గోడలు  లేని వాటినిగుర్తించి  ఒక నివేదికను  తయారు  చేయాలన్నారు.  ఏజెన్సీ ప్రాంత మండలాలలో రక్తహీనతతో
 బాదపడుతున్న బాల బాలికలను గుర్తించాలన్నారు.  చిరుధాన్యాలను వినియోగించి  మంచి పౌష్టికాహారం అందే విదంగా చూడాలన్నారు.  తరుచుగా డాక్టర్లు పాఠశాలలు, హాస్టల్స్‌ ను సందర్శించి పిల్లలకు  వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.  కౌమార దశలో వచ్చే మార్పులను గురించి పిల్లలకు తెలియజేయడం,  వ్యక్తిగతపరిశుభ్రత పై అవగాహన కలిగించాలన్నారు. యునిసెఫ్‌ ప్రతినిధి డాక్టర్‌ మీనాసోమ్‌ మాట్లాడుతూ కౌమార  బాల బాలికల  సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం  చేపట్టిన  ఆర్‌ కె  ఎస్‌  కె పథకంలో  బాగంగా  యూత్‌ ఫర్‌ సేవా సహకారంతో  పైలెట్‌ ప్రాజెక్టును 6 నెలల నుండి  ప్రభుత్వ పాఠశాలలో డేటాను పొందుపర్చడం జరుగుతుందన్నారు. ఆయా పాఠశాలలో మౌళిక వసతుల వివరాలను సేకరించడం అయ్యిందన్నారు.  జిల్లాలో ఐ టిడి ఎ , సర్వశిక్ష అభియాన్‌, విద్య , వైద్య ఆరోగ్య శాఖలకు సంబందించి  298 పాఠశాలలో  95,858మంది కౌమార  బాలబాలికలను గుర్తించడం జరిగిందన్నారు. పాఠశాలలకు జియో ట్యాగంగ్‌  చేయడం జరిగిందని,  పాఠశాలలకు దగ్గరి లోగల ఆసుపత్రులకు అనుసంధానం  చేయడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు  చేసి పిల్లలకు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ  చేయడం జరుగుతుందన్నారు. జూన్‌ నుండి 2వ దశ  సర్వే  చేయనున్నామన్నారు.  పూర్తి వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వ దృష్టికితీసుకు వెళ్లడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో   జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఉమా సుందరి, జెడి డా.వసంతకుమారి, యునిసెఫ్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ సునంద, డి ఇ ఒ నాగమణి, సర్వశిక్ష అభియాన్‌  పి.ఓ శివప్రసాద్‌,   ట్రైబల్‌ వెల్పేరు డిడి కమలకుమారి , యునిసెఫ్‌ ప్రతినిధులు సంతోష్‌  కుమార్‌, ఉమా శంకర్‌,జితేంద్ర, ఉదయ శంకర్‌ రాజు, వెంకన్న బాబ్జి తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు