Loading...

18, జులై 2017, మంగళవారం

అజికో ఫార్మా కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

పరవాడ, చైతన్యవా‌రధి: జవహార్ లాల్ ఫార్మాసిటీలో గల అజీకో ఫార్మా కంపెనీ లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహార చెక్కులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ముర్తి అందజేశారు. మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ అథితి గృహంలో నిర్వహించిన కార్యక్రమం లో ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం లో అజీకో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, మండలాధ్యక్షుడు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ మండలాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు, నాయకులు చింతకాయల ముత్యాలు, బొడ్డపల్లి అప్పారావు, బుగిడి రామగోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి