1.4 కేజీల బంగారం స్వాధీనం
విశాఖపట్నం: విశాఖలో పలు దొంగతనాలకు పాల్పడి మంగళవారం పట్టుబడ్డ ముగ్గురు కరడు గట్టిన దొంగల్ని అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ శివధర్ రెడ్డి ఈరోజు తెలిపారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్కి చెందిన భగవాన్ గిరి, సలీం ఖురేషీ నేర జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఈ నెల ఒకటిన విశాఖ వచ్చి రెండు లాడ్జీల్లో బసచేసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. మంగళవారం కూర్మన్న పాలెం అక్షర అపార్ట్మెంట్లో దొంగతనం చేసి, గుర్తించిన వాచ్మెన్పై దాడిచేసి పారిపోగా, వాచ్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుప్రాంతాల్లో వాహనతనిఖీలు నిర్వహించగా విశాఖ జిల్లాలోని నక్కపల్లి వద్ద దొంగలు పోలీసులకు తారసపడ్డారు. ఎస్ఐపై దాడిచేసి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అఎస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.4 కిలోల బంగారం, 5,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విశాఖపట్నం: విశాఖలో పలు దొంగతనాలకు పాల్పడి మంగళవారం పట్టుబడ్డ ముగ్గురు కరడు గట్టిన దొంగల్ని అరెస్టు చేసినట్లు విశాఖ సీపీ శివధర్ రెడ్డి ఈరోజు తెలిపారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశమందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో దొంగల వివరాలను వెల్లడించారు.
ఉత్తర ప్రదేశ్కి చెందిన భగవాన్ గిరి, సలీం ఖురేషీ నేర జీవితానికి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. ఈ నెల ఒకటిన విశాఖ వచ్చి రెండు లాడ్జీల్లో బసచేసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. మంగళవారం కూర్మన్న పాలెం అక్షర అపార్ట్మెంట్లో దొంగతనం చేసి, గుర్తించిన వాచ్మెన్పై దాడిచేసి పారిపోగా, వాచ్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దుప్రాంతాల్లో వాహనతనిఖీలు నిర్వహించగా విశాఖ జిల్లాలోని నక్కపల్లి వద్ద దొంగలు పోలీసులకు తారసపడ్డారు. ఎస్ఐపై దాడిచేసి పారిపోవడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అఎస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.4 కిలోల బంగారం, 5,700 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి