ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రెండో వన్డేలో భారత్‌ ఘనవిజయం

జోహ్నెస్‌బర్గ్‌: మొదటి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి ధోనీ సేన కసి తీర్చుకుంది. సఫారీ జట్టుపై 1 పరుగు తేడాతో గెలిచి చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేసింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో కేవలం 1 పరుగు తేడాతో స్మిత్‌ సేనపై విజయం సాధించింది. యువరాజ్‌ 53(68), ధోనీ 38(61) సమయోచిత
బ్యాటింగ్‌తో పాటు మునాఫ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఐదు వన్డేల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. భారత్‌ నిర్దేశించిన 191 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే దిశలో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్‌ స్మిత్‌ 77(98) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ రాణించలేదు. స్మిత్‌ సేన వెన్ను విరచడంలో భారత్‌ బౌలర్లు సఫలమయ్యారు. ముఖ్యంగా మునాఫ్‌పటేల్‌ నాలుగు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశాడు. జహీర్‌ఖాన్‌ రెండు వికెట్లు తీయగా, నెహ్రా, హర్భజన్‌సింగ్‌, రోహితశర్మలకు తలో వికెట్‌ దక్కింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 190 పరుగులకు ఆలౌటైంది. తొత్సబే నాలుగు వికెట్లు తీసి భారత్‌ అధిక స్కోరు చేయకుండా నిలువరించాడు. మిగిలిన బౌలర్లలలో స్టెయిన్‌, మోర్కెల్‌లు చెరో రెండు వికెట్లు తీయగా, బొతాకు ఒక వికెట్‌ దక్కింది. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మునాఫ్‌పటేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈనెల 18న కేప్‌టౌన్‌లో మూడో వన్డే జరగనుంది.

కామెంట్‌లు