తిరుపతి: తిరుమల శ్రీవారి బంగారు, వెండి ఆభరణాలు పూర్తి స్వచ్ఛంగా, నాణ్యతతో ఉన్నాయని హైదరాబాదు ప్రభుత్వ మింట్ నిర్ధరించింది. స్వామివారి ఆభరణాలను పరిశీలించిన మింట్ జనరల్ మేనేజర్ శశిభూషణ్ శనివారం తితిదే జేఈవో యువరాజ్ను కలిసి ఈ మేరకు నివేదిక అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదు ప్రభుత్వ మింట్ గత ఏడాది ఫిబ్రవరి నుంచి పది పర్యాయాలు శ్రీవారి ఆలయాన్ని సందర్శించింది. బంగారు, వెండి నగలను పరిశీలించింది.
'మా ఆధ్వర్యంలో 650 బంగారు ఆభరణాలు, 350 వెండి నగలను పరిశీలించాం. ఏ ఒక్క ఆభరణం బరువు తగ్గడం గానీ, పరిమాణం తగ్గడం గానీ జరగలేదు' అని శశిభూషణ్ చెప్పారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి