Loading...

26, డిసెంబర్ 2010, ఆదివారం

మైనార్టీలో రాష్ట్ర ప్రభుత్వం

ఎమ్మెల్యే గంటా
చోడవరం, చైతన్యవారధి: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడిందని ప్రజారాజ్యం పొలిట్‌బ్యూరో సభ్యుడు, అనకాపల్లి ఎం.ఎల్‌.ఎ. గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ లక్ష్యదీక్షకు 30 మంది ఎం.ఎల్‌.ఎ.లు మద్దతు తెలపగా మరికొంతమంది తెర వెనుక ఉన్నారన్నారు.
ప్రభుత్వ భవిష్యత్తు తన కనుసన్నల్లో ఉందన్నట్లుగా జగన్‌ సంకేతాలు పంపిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనార్టీలో పడితే ప్రరాపా మద్దతునిస్తుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్‌ లక్ష్య దీక్షలో పాల్గొన్న ప్రరాపాకు చెందిన ఇద్దరు ఎం.ఎల్‌.ఎ.ల విషయం పార్టీ క్రమశిక్షణాసంఘం చూసుకుంటుందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి