ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నాణ్యతలేని విద్య నిరుపయోగం

-యు.జి.సి. సభ్యుడు ప్రొఫెసర్‌ కె.రామ్మూర్తినాయుడు
శ్రీకాకుళం, నవంబర్ 21(చైతన్యవారధి): నాణ్యతలేని విద్య నిరుపయోగమని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యు.జి.సి.) సభ్యుడు ప్రొఫెసర్‌ కె.రామ్మూర్తినాయుడు అన్నారు. మునసబుపేటలోని గురజాడ విద్యాసంస్థల ప్రాంగణంలో ఇంట్రాఫ్యాకల్టీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడుతూ నేటి సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యలో నాణ్యత లోపిస్తే అది విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడదన్నారు. విద్య వైపు బాలబాలికలను ఆకర్షించేలా బోధనలో మెలకువలు పాటించాలన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఉంటుందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం జాతీయ సెమినార్‌లో పాల్గొన్న విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ రామ్మూర్తినాయుడు దంపతులను గురజాడ విద్యాసంస్థల వ్యవస్థాపకులు జి.వి.స్వామినాయుడు, సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో గాయత్రి కళాశాల ప్రిన్సిపల్‌ డా. పులఖండం శ్రీనివాసరావు, బి.ఇ.డి. కళాశాల ప్రిన్సిపల్‌ రంగారావు, డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డి.అప్పారావు, కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు