హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మంత్రి దానం నాగేందర్ అన్నారు. శ్రీకృష్ణకమిటీ తన నివేదికలో కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదన చేస్తున్నట్లు వస్తున్న వూహాగానాలపై నాగేందర్ స్పందించారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి, తెలంగాణ గుండెకాయగా ఉన్న భాగ్యనగరాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిగా ఉంచేందుకు తాము ఒప్పుకోబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్, పేర్వారం రాములు వంటి వారి వాదనతో తాను ఏకీభవిస్తున్నానన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి