విశాఖపట్నం : ఈశాన్యరుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. కోస్తా తీరం వెంబడి ఈశాన్య దిశనుంచి గంటకు 40 నుంచి 45 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు తెలంగాణలో చెదురుముదురు జల్లులు పడే అవకాశముంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి