ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

గాజువాక, ఏప్రిల్, 17(చైతన్యవారధి): జీవీఎంసీ ౫౦వ వార్డు పరిధిలో గల సంజీవిగిరి కాలనీలో గల విజ్ణాన్ స్కూల్ లో ఎమ్ సెట్, పాలిటెక్నిక్ విద్యార్దులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు. జాన్సీ ఎడ్యుకేషనల్ సోసైటీ సహకారంతో ఈ మెటీరియల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రధర్ రావు, తెదేపా విశాఖ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ ముఖ్య అథితులుగా పాల్గొని విద్యార్ధులకు అందజేశారు. సుమారు 2౦౦ మంది విద్యార్ధులకు ఈ మెటీరియల్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  విజ్ణాన్ స్కూల్ డైరెక్టర్ డి.వి.రమణీ, జాన్సీ ఎడ్యుకేషనల్ ట్రస్టు వ్యవస్ధాపకులు వానపల్లి శ్రీనివాసరావు,  ఎం.ఎస్.కుమార్, సి.హెచ్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.        

నోవర్క్ ఆర్గానిక్స్ నుంచి సేంద్రియ ఎరువులు, పశు పోషక ఉత్పత్తులు

విశాఖపట్నం, చైతన్యవా‌రధి: పూణేకు చెందిన నోవర్క్ ఆర్గానిక్స్ సంస్థ సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులు, పశుపోషక ఉత్పత్తులను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్థానిక హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉత్పత్తుల వివరాలు వివరించారు. నేలలో తేమను నిలిపేందుకు ప్రత్యేక మైన ఒక ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నోవర్క్ సంస్థ జీఎం సుభీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ తమ సంస్థ ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, హాని కరం కాని పశు పోషణ ఉత్పత్తులు ఉపయోగించటం వల్ల మెరుగైన ఫలితాలు సాధించ వచ్చునన్నారు. ఎటువంటి రసాయనాలు లేని సహజ సిద్ధంగా లభించే మొక్కల నుంచి ఈ ఉత్పత్తులు తయారు చేయడం జ‌రిగిందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఖర్చుకు అందిస్తున్నామన్నారు.
రీజినల్ సేల్స్ మేనేజర్ ఇందుకూరి రవి మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు హెర్భల్స్ తో తయారు చేయడం తో భూమి మరింత సారవంతమవుతుందన్నారు.  తద్వారా పంట పెరుగు దల ఆశాజనకంగా ఉంటుందన్నారు. ఏపీ ఫ్రాంచేజీ టీవిఎస్ ఎన్ రాజు మాట్లాడుతూ నోవర్క్ ఉత్పత్తులు రాష్ట్రంలోనే పూల రైతుల ఇంట తలుపులు తట్టనున్నాయన్నారు. ఉత్పత్తుల ద్వారా కేవలం వ్యవసాయ, పశుపోషణ ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడమే కాక ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించవచ్చన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. నోవర్క్ సంస్థ నేషనల్ మీడియా మేనేజర్ ఆశాలత నాయక్ మాట్లాడుతూ ఏపీలో ప్రతి గ్రామానికి తమ ఉత్పత్తులు చేరువ చేయాలన్నదే ముఖ్య లక్ష్య మన్నారు.

పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైకిళ్ల పంపిణీ

పరవాడ, చైతన్య వారధి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ర్ధినీలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చుక్క రామునాయుడు,
పరవాడ 1 ఎంపీటీసీ పైల శ్రీనివాసరావు, పరవాడ 2 ఎంపీటీసీ సిరపురపు అప్పల నాయుడు, పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్ పైల హరీష్, పైల రమణబాబు, పోతల అప్పల నాయుడు, ఉపాధ్యాయులు,  తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 

అజికో ఫార్మా కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

పరవాడ, చైతన్యవా‌రధి: జవహార్ లాల్ ఫార్మాసిటీలో గల అజీకో ఫార్మా కంపెనీ లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహార చెక్కులను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ముర్తి అందజేశారు. మంగళవారం స్ధానిక జిల్లా పరిషత్ అథితి గృహంలో నిర్వహించిన కార్యక్రమం లో ఈ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమం లో అజీకో ఫార్మా కంపెనీ ప్రతినిధులు, మండలాధ్యక్షుడు మాసవరపు అప్పలనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ మండలాధ్యక్షుడు మాదంశెట్టి నీలబాబు, నాయకులు చింతకాయల ముత్యాలు, బొడ్డపల్లి అప్పారావు, బుగిడి రామగోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

కౌమార దశ బాల బాలికల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టండి

విశాఖపట్నం, చైతన్యవారధి:
పాఠశాలలలో బాలబాలికల  కౌమార దశల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాల్సిందిగా  జిల్లా కలెక్టర్‌  ప్రవీణ్‌ కుమార్‌ సంబందిత అధికారులను  ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో రాష్ట్రీయ కిశోర్‌ స్వాస్త్య కార్యక్రమం  లో భాగంగా  యునిసెఫ్‌ సహకారంతో యూత్‌ ఫర్‌ సేవ సంస్థ   ఏర్పాటు  చేసిన  కార్యక్రమంలో  కలెక్టర్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  ప్రభుత్వ ,సంక్షేమ  పాఠశాలలలో మరుగుదొడ్లు, నిరంతర నీటి సదుపాయం, ప్రహరీ గోడలు  లేని వాటినిగుర్తించి  ఒక నివేదికను  తయారు  చేయాలన్నారు.  ఏజెన్సీ ప్రాంత మండలాలలో రక్తహీనతతో

గృహలకు సంబందించి పూర్తి నివేదిక అందజేయాలి

విశాఖపట్నం, చైతన్యవారధి:
ఎన్టీ ఆర్‌ గృహ నిర్మాణాలకు సంబందించి ఈ నెల 24వ తేది లోపల పూర్తి నివేదికను  అందజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌  కుమార్‌ ఆ శాఖ అధికారులను ఆదేశించారు.  కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ నిర్మాణాలను వేగవంతంగా  చేపట్టి జిల్లాను  మొదటి స్థానంలో  నిలిపేందుకు కృషి  చేయాలన్నారు.  ఇంటింటికి సర్వే  చేపట్టి అర్హులైన లబ్దిదారుల  లిస్టును

భూముల కేటాయింపు పనులు వేగవంతం చేయాలి

- జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌

విశాఖపట్నం, చైతన్యవారధి:
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను కేటాయించేందుకు 4 వేల 68 ఎకరాల ఎసైన్డు, ప్రభుత్వ భూముల ఎలియనేషన్‌ పనులను వేగవంతం  చేయాలని రెవిన్యూ, ఏ.పి.ఐ.ఐ.సి. అధికారులను జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌ ఆదేశించారు. తన చాంబరులో ఏ.పి.ఐ.ఐ.సి., రెవిన్యూ అధికారులతో కలెక్టర్‌ సమావేశమై భూముల ఎలియనేషన్‌ పనుల ప్రగతిని సమీక్షించారు. సబ్బవరం మండలం గాలిభీమవరం,

మంగమారింపేట బీచ్‌లో రూ.2 కోట్లతో వాటర్‌ స్ట్పోర్ట్సు హబ్‌

- జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌

విశాఖపట్నం, చైతన్యవారధి:
మంగమారింపేట బీచ్‌లో రూ.2 కోట్లతో వాటర్‌ స్ట్పోర్ట్సు హబ్‌ అభివృద్దికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు వెంటనే ఒక ఆర్టిటెక్టు ఏజన్సీని నియమించాలని జిల్లా కలెక్టర్‌ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ అద్యక్షతన జిల్లా టూరిజమ్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మంగమారింపేట బీచ్‌లో  వాటర్‌ స్పోర్ట్సుకు అవసరమైన జట్టీ, ల్యాండ్‌

పరవాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక

పరవాడ, చైతన్య వారధి: పరవాడ మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలను శనివారం నిర్వహించారు. ఎలక్ట్రానిక్, ఫ్రింట్ మీడియా లకు వేరుగా కార్యవర్గాలను ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ అధ్యక్ష, కార్యదర్శులుగా శివాజీ, రెడ్డి గోపి లు ఎన్నికయ్యారు. ఫ్రింట్ మీడియా కార్యవర్గం అధ్యక్ష, కార్యదర్శులుగా లాలం కృష్ణా రావు, బాబు ఎన్నికయ్యారు.

మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడుగా సన్నిదేముడు

 పరవాడ, చైతన్య వారధి: పరవాడ మండల తెలుగు దేశం పార్టీ  అధ్యక్షుడు గా బొండా సన్నిదేముడు ఎన్నికయ్యారు. మండల కేంద్రం పరవాడలో తెదేపా మండల పార్టీ ఎన్నికల ను నిర్వహించారు.