పరవాడ, చైతన్య వారధి: మండల పరిధిలో గల జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణానికి సహాకరిస్తానని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి హామీ ఇచ్చారు. శనివారం మండల కేంద్రం పరవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమిష్టిగా చేసుకోవడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహాయ సహాకారాలు అందజేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మాసవరపు అప్పల నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు పైల జగన్నాథరావు, మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, ఎంపీటీసీలు పైల శ్రీ ని వాసరావు, సిరిపురపు అప్పలనాయుడు, సర్పంచ్ చుక్క రామునాయుడు తదితరులు పాల్గోన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి