హైదరాబాద్ : దేశ సంస్కృతీ సంప్రదాయాలను మంట కలుపుతూ యువతను పెడదోవ పట్టించేలా ఫిబ్రవరి 14న జరుపుకొనే వాలెన్టైన్స్డేను బహిష్కరిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్దల్లు ప్రకటించాయి. ఆ రోజున ప్రేమ జంటలు పార్కులు, రోడ్లపై కనిపిస్తే పట్టుకుని పెళ్లి చేస్తామని హెచ్చరించాయి. శనివారం కోఠిలోని వీహెచ్పీ రాష్ట్ర
కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్రెడ్డి, సహ కార్యదర్శి ఠాకూర్ యమన్సింగ్, బండారు సత్యనారాయణ, భరత్వంశీసింగ్ తదితరులు వాలెన్టైన్స్డేను బహిష్కరిస్తూ రూపొందించిన గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ విదేశీ సంతాప సూచికంగా ప్రేమికుల రోజు పేరిట జరుపుకొనే వాలెన్టైన్స్డే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా విచ్ఛలవిడిగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారాలను పెంచుకోవడంతోపాటు మత మార్పిడులను ప్రోత్సహించేందుకే విదేశీ శక్తుల చేస్తున్న కుట్రలో భాగమని మండిపడ్డారు. ఆ రోజు హోటళ్లు, పబ్బులు, రిసార్ట్స్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా సంస్థలకు సూచించామని అయినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తమ కార్యకర్తలు అడ్డుకుంటారని తెలిపారు. ఎలాంటి పరిణామాలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యువతను పెడదోవ పట్టించే విధంగా నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు రంగంలో ఉంటాయన్నారు. వాలెన్టైన్స్-డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతుల ఇవ్వకూడదని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కలిసి విన్నవించామని తెలిపారు.
కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్రెడ్డి, సహ కార్యదర్శి ఠాకూర్ యమన్సింగ్, బండారు సత్యనారాయణ, భరత్వంశీసింగ్ తదితరులు వాలెన్టైన్స్డేను బహిష్కరిస్తూ రూపొందించిన గోడప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓ విదేశీ సంతాప సూచికంగా ప్రేమికుల రోజు పేరిట జరుపుకొనే వాలెన్టైన్స్డే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేమకు వ్యతిరేకం కాదని, ప్రేమ పేరుతో సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా విచ్ఛలవిడిగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారాలను పెంచుకోవడంతోపాటు మత మార్పిడులను ప్రోత్సహించేందుకే విదేశీ శక్తుల చేస్తున్న కుట్రలో భాగమని మండిపడ్డారు. ఆ రోజు హోటళ్లు, పబ్బులు, రిసార్ట్స్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా అడ్డుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా సంస్థలకు సూచించామని అయినా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా తమ కార్యకర్తలు అడ్డుకుంటారని తెలిపారు. ఎలాంటి పరిణామాలకైనా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యువతను పెడదోవ పట్టించే విధంగా నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు రంగంలో ఉంటాయన్నారు. వాలెన్టైన్స్-డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలకు అనుమతుల ఇవ్వకూడదని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లను కలిసి విన్నవించామని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి