హైదరాబాద్: ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు నమోదుకు ఈనెల 20 వరకు గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు. నేటితో గడువు ముగుస్తున్నందున విద్యార్థుల కోరిక మేరకు గడువు పెంపుదల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉపకారవేతనాల కోసం ఇప్పటివరకు 22 లక్షల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇదే చివరి అవకాశమని... దీన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి