ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మా తెలుగు కవికి మల్లెపూదండ...!!

"మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి"
అంటూ... నేలను నేలతల్లిగా, కన్నతల్లిగా, తెలుగు తల్లిగా మార్చి ఆరాధ్యనీయం చేసిన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి. కన్నతల్లిచేత మంగళహారతులు పొందే పిల్లలున్నారుగానీ, కన్నతల్లికి మంగళహారతులు పట్టేవారు అప్పటిదాకా లేరు. అయితే, 1956లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఆంధ్రప్రదేశ్ తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించే క్రమంలో ఈ "తెలుగుతల్లి గీతం" ఆంధ్రుల అభిమాన గీతంగా మారింది.

ఆంధ్రుల భావోగ్వేగానికి ప్రతీకగా, వారి ఆత్మలకు ప్రతిరూపంగా మారిన ఈ తెలుగుతల్లి గీతంలో గొప్ప సాహిత్యం లేకపోయినా... అందరినీ ముక్తకంఠంతో కలిపే "మా" అనే ఏకత్వం ఉంది. గురజాడ "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్.." అంటూ దేశాన్ని మనుషులుగా గుర్తించి, దేశంపట్ల మమకారాన్ని పెంచితే... శంకరంబాడి తెలుగుతల్లిని కన్నతల్లిగా చేశారు. అందరినీ ఆమె కన్నబిడ్డలుగా చేసిన ఆయన మాతృభావనతో మమకారం పెంచారు. ఈరోజు ఆ మహనీయుడి జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్మృతిలో....
మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు...
పతిభక్తిని ప్రస్తావిస్తూ మల్లమ్మను, ధీరత్వాన్ని ప్రస్తావిస్తూ తిమ్మరుసును, కీర్తిని చాటుతూ కృష్ణదేవరాయలను తీసుకోవడమంటే, అత్యున్నతమైన ప్రతీకలను వాడుకోవటమే...! ఆ గీతాన్ని అంతటితో ముగించకుండా "మా చెవుల రింగుమని మారుమ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీపాటలే...
తెలుగు నేల వర్ణన, పూర్వవైభవ ప్రశస్తి మెండుగా కనిపించే ఈ గీతంలో... "గలగలా గోదారి, బిరబిరా కృష్ణమ్మ" అనే పదాలను పలుకుతుంటే, వింటున్నవారి కళ్లెదుట అవి ప్రవహిస్తున్న భావనను కలిగిస్తాయి. అలాగే "అమరావతీ నగర అపురూప శిల్పాలు" అనేదాంట్లో కళావైభవానికి నిదర్శనాలుగా, "త్యాగయ్య గొంతులో తారాడే నాదాలు" నాటి సంగీత వైభవానికి తార్కాణంగా.. "తిక్కయ్య కలములో తియ్యందనాలు" సాహితీ మధురిమకు ఆనవాళ్లుగా మనముందు సాక్షాత్కరిస్తుంది.
పతిభక్తిని ప్రస్తావిస్తూ మల్లమ్మను, ధీరత్వాన్ని ప్రస్తావిస్తూ తిమ్మరుసును, కీర్తిని చాటుతూ కృష్ణదేవరాయలను తీసుకోవడమంటే, అత్యున్నతమైన ప్రతీకలను వాడుకోవటమే...! ఆ గీతాన్ని అంతటితో ముగించకుండా "మా చెవుల రింగుమని మారుమ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం" అంటూ సమస్త తెలుగుజాతి పక్షాన... శంకరంబాడి ఎలుగెత్తి చాటారు.
శంకరంబాడి జీవిత విశేషాల్లోకి వస్తే... 1914వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారు. మదనపల్లిలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన ఈయన చిన్నతనం నుంచే స్వతంత్రభావాలను కలిగి ఉండేవారు. బీ.ఏ. పట్టా పుచ్చుకున్న అనంతరం కొంతకాలం చిత్తూరు, కడప జిల్లాలలో పాఠశాల ఇన్‌స్పెక్టరుగా విధులు నిర్వహించారు. ఆయన ప్రవృత్తి కారణంగా ఆ ఉద్యోగంలో కొనసాగలేక పోయారు.

కామెంట్‌లు