ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తుపాను నష్టాలను పరిశీలించిన కేంద్ర బృందం

ఆనందపురం, చైతన్యవారధి: గతనెల్లో జిల్లాను కుదిపేసిన నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాలను కేంద్ర బృందం పరిశీలించింది. అయిదు జిల్లాల్లో పర్యటించి తుపాను నష్టాలను తెలుసుకొనేందుకు 8మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంది. వీరు రెండు బృందాలుగా వీడారు. నలుగురు సభ్యులతో
కూడిన ఒక బృందం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లగా, మరో నలుగురు సభ్యుల బృందం విశాఖలో ఉంది. జిల్లాకు వచ్చిన బృందానికి జాతీయ రహదారుల సంస్థప్రాంతీయ కమిషనర్‌ అశ్వనీకుమార్‌ నాయకత్వం వహించారు. ఈ బృందంలో జాతీయ నీటి యాజమాన్య సంస్థ ఎస్‌.ఇ. రమేష్‌కుమార్‌, మత్స్య,పశుసంవర్ధకశాఖ ఉపకమిషనర్‌ ఎ.పి.చతుర్వేది, కేంద్ర ప్రభుత్వ అండర్‌ కార్యదర్శి తివారిలు సభ్యులుగా ఉన్నారు. వీరంతా గవర్నర్‌ బంగ్లాకు గురువారం రాత్రి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. నవంబరు మొదటి వారంలో వచ్చిన నీలం తుపాను కారణంగా నష్టపోయిన పంటల వివరాలను జిల్లా రెవెన్యూ అధికారి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నీలం తుపాను కారణంగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశామని, దాదాపు రూ.350కోట్ల మేర ఆస్తులకు నష్టం జరిగినట్లు డీఆర్వో వెల్లడించారు. 53హెక్టార్ల పరిధిలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, దీనిలో వరి, చెరకు వంటి పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఇళ్లకు, ప్రభుత్వ ఆస్తులు, రహదారులు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ తదితర శాఖలకు చెందిన రహదారులు, కల్వర్టులు వంటి వాటికి నష్టం వాటిల్లిందని డీఆర్వో కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను వారికి చూపించారు. గురువారం ఈ బృందం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నది.

కామెంట్‌లు