ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఉక్కు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి

గాజువాక, డిసెంబరు ౨౭(చైతన్యవారధి): ఉపాధికోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని, విశాఖఉక్కులో నిర్వాసితులకు తాను పూర్తి అండగా ఉంటానని కేంద్రమంత్రి డి.పురందేశ్వరి హామీ ఇచ్చారు.త్వరలోనే ఉక్కు సీఎండీతో సమావేశం ఏర్పాటుచేసి పెండింగ్‌ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. గాజువాక
జోనల్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం మండలంలోని 37మంది లబ్ధిదారులకు రూ.5వేలు చొప్పున ఎన్‌ఎఫ్‌బీఎస్‌ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్‌ కింద మరో లబ్ధిదారునికి రూ.20వేలు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఉక్కునిర్వాసితుల నుద్దేశించి మంత్రి మాట్లాడారు. మూడు దశాబ్ధాలుగా నిర్వాసితులు ఉపాధికోసం ఆందోళన సాగిస్తున్నారని, ఇన్నాళ్లూ న్యాయం జరగకపోవడం బాధాకరమన్నారు. తన దృష్టికి గాజువాక ఎమ్మెల్యే వెంకట్రామయ్య ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొస్తున్నారని, పని ఒత్తిడి దృష్ట్యా తగిన న్యాయం చేయలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. ఉక్కును ప్రయివేటీకరించే ప్రసక్తేలేదని, ఈమేరకు ప్రధానమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నిర్వాసితులకు ఉద్యోగాలు, ఆర్ధిక ప్రయోజనాలు కల్పించడంలో తాను ముందుంటానని హామీ ఇచ్చారు.బీహెచ్‌పీవీ, జింక్‌ సమస్యలపై ప్రస్తావిస్తూ ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించడానికి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. తుపాను కారణంగా గాజువాకకు జరిగిన నష్టంపై అధికారులతో మాట్లాడానని, నిధుల మంజూరుకు ప్రభుత్వాన్ని ఒప్పించనున్నానన్నారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్నాని చెప్పారు. సభకు ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉక్కులో నిర్వాసితులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రస్ధాయిలో మంత్రి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి నిర్వాసితుల ఉపాధికి శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. గాజువాక హౌస్‌కమిటీ భూముల సమస్య, బీహెచ్‌పీవీ, జింక్‌ కార్మికులకు జరిగిన అన్యాయంపై స్పందించాలన్నారు. తుంగ్లాంగేటు తెరిపించడం, ఏపీఐఐసీ నిర్వాసితులకు స్థలాల కేటాయింపులో శ్రద్ధచూపాలని కోరారు. తుపాను నష్టాలను భర్తీచేయడానికి నిధులు మంజూరు చేయాలని సూచించారు. గాజువాక తహసిల్దార్‌ సింహాద్రిరావు, జోనల్‌ ఇ.ఇ.కోటేశ్వరరావు పాల్గొన్నారు. నిర్వాసిత సంఘం జేఏసీ సభ్యుడు గొందేశి సత్యారావు మాట్లాడుతూ ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ఉక్కు యాజమాన్యం స్పందించడంలేదని, కేంద్రమంత్రి చొరవతో సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అఖిలపక్ష నాయకులు పులి అప్పలరెడ్డి, రమణారెడ్డి, గంట్యాడ గోవింద్‌, కరణం కనకారావు, మంత్రిశంకర్‌, అస్మత్‌అలీ, ఇల్లపురాము, శ్రీను, రోహిణి, చొక్కాసూరిబాబు, మూర్తి, గుర్నాధరెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమస్యలపై మంత్రికి వినతులు అందజేశారు.

కామెంట్‌లు