ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అఖిలపక్ష సమావేశం జరుగుతుంది: చిదంబరం

ఢిల్లీ, జనవరి 4(న్యూస్ నెట్): శ్రీకృష్ణకమిటీ నివేదికకోసం జనవరి 6న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం జరుగుతుందని ఇది రద్దు కాలేదని హోంమంత్రి చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ సమావేశానికి ఒక్కో పార్టీ తరపున ఇద్దరిని పిలిచామని ఒకరా లేక ఇద్దరు వస్తారా అనేది
ఆయా పార్టీల ఇష్టమని చిదంబరం అన్నారు. ఇద్దరు వచ్చినంతమాత్రాన భిన్నాభిప్రాయాలేం ఉండవు కదా అని ఆయన అన్నారు. గతంలో సీపీఐ, సీపీఎం, ఎంఐఎం తరపున ఇద్దరు చొప్పున వచ్చారని ఆయన అన్నారు. తెరాస కూడా సమావేశానికి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అఖిలపక్ష సమావేశం సమయాన్ని గురించి విలేకరులు ప్రశ్నించగా సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదని సమయం గురించి మీకెందుకని అన్నారు. నివేదిక బహిర్గతమైన తరువాత అల్లర్లు జరుగుతాయనే ప్రచారం నమ్మవద్దని కోరారు. ఏ విషయంపైన అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం జరుగుతుందని అన్నారు. సమావేశం చివర్లో మాత్రం అఖిలపక్ష సమావేశం 6వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుందని చెప్పారు. సమావేశం ముగియగానే నివేదికను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

కామెంట్‌లు