జగన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి : యనమల
హైదరాబాద్ : కడప ఎంపీ జగన్మోహన్రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. జగన్ 84 కోట్ల రూపాయల అడ్వాన్స్ టాక్స్ చెల్లింపుతో ఆయన అక్రమ ఆస్తులపై మేం చేసిన ఆరోపణలు రుజువయ్యాయని అన్నారు. ప్రపంచ కోటీశ్వరులు బిల్గేట్స్, బఫెట్లకే ఏడాదిలో 1100 శాతం వృద్ధి సాధ్యం కాలేదని, జగన్కు ఏవిధంగా సాధ్యమైందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి